AP: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, నిర్మాతలు, నటులు భేటీ కానున్నారు. రేపు అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు వారు సీఎం చంద్రబాబును కలవనున్నారట. అయితే మొదట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత వరకు సినీ ప్రముఖులు సీఎంను కలవ లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మాత్రమే కలిశారు. ఇటీవల థియేటర్ల బంద్ కు సంబంధించిన విషయం పై స్పందించిన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సినీ ప్రముఖులు ఒక్కసారైన సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని థియేటర్ ల పరిస్థితిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పలు థియేటర్ లలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఇదే విషయంపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను సినీ ప్రముఖులు కలవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు.
మొదటగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాత ఆయనతో కలిసి సినీ ప్రముఖలు సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారట. అక్కడ ఏపీలో సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై సీఎం సినీ పెద్దలు చర్చించనున్నారట. ఈ సమావేశం తర్వాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం కానుట్టు తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబుతో కలిసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి సుమారు 35 నుంచి 40 మంది వరకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. వారిలో దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ అశ్విన్ ఉండగా, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు వంటి వారు కలవనున్నారు. వీరితో పాటు నటులు బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని వంటి వారు కూడా వెళ్ళానున్నారట.