దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి.. కేంద్రానికి కేసీఆర్ సవాలు!

కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు . తన ప్రసంగంలో బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కేంద్రం వెంటపడతామన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు.