తిరుపతి ఉప ఎన్నిక: టీడీపీ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు

TDP MP candidate for by election in tirupati announced by chandrababu

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బల్లి దుర్గాప్రసాద్ వైసీపీకి చెందిన ఎంపీ. ఆయన అకాల మృతితో త్వరలో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

TDP MP candidate for by election in tirupati announced by chandrababu
TDP MP candidate for by election in tirupati announced by chandrababu

ఈనేపథ్యంలో తిరుపతి ఉపఎన్నిక కోసం టీడీపీ.. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. పనబాక లక్ష్మిని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

TDP MP candidate for by election in tirupati announced by chandrababu
TDP MP candidate for by election in tirupati announced by chandrababu

అనంతరం.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు… పనబాక లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లోనూ తిరుపతి ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమెనే మళ్లీ టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. అలాగే.. పనబాక లక్ష్మి గెలుపు కోసం పార్టీ నేతలంతా కృషి చేయాలని చంద్రబాబు ఈసందర్భంగా స్పష్టం చేశారు.