‘నవ్వకండి… సీరియస్ ఇష్యూ’… టీడీపీ నేతలపై బాలకృష్ణ ఆగ్రహం!

ఎమ్మెల్యే నందమూరి బాలయ్య హిందూపురం పర్యటనలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గురువారం పట్టణంలో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా బాలకృష్ణ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురానికి జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను మాట్లాడుతున్న వేళ, నవ్విన పార్టీ నేతలపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

BalaKrishna Serious on TDP Leaders Video Viral

నేటి తరం యువత గురించి మాట్లాడిన బాలకృష్ణ, “రాత్రి అయితే బండ్లేసుకుని ఏదో రకంగా రోడ్లలో స్ట్రీట్ లైట్లు చూసుకుంటూ… చుక్కలు లెక్కబెడుతూ.. వీళ్లలా పోవడం… ఏదో ఢీ కొట్టడం…” అంటుండగా, పక్కనే ఉన్న హిందూపురం తెలుగుదేశం పార్లమెటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బీకే పార్థసారధి తదితరులు పెద్దగా నవ్వారు.

వెంటనే కాస్తంత అసహనానికి గురైన బాలయ్య, “ఏయ్… నవ్వకండి… ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. నాకు తెలుసు. చాలా మంది అలా తయారవుతున్నారు. సో జాగ్రత్తగా ఉండు…” అని వేలు చూపుతూ హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు. మరోవైపు హిందూపురంలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాలయ్య వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. రెండు, మూడు రోజుల పాటూ అక్కడే అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.. టీడీపీ నామమాత్రపు సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో బాలయ్య జాగ్రత్తపడ్డారు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు.