జ‌గ‌న్ పై లోకేష్ ట్వీట్..ఇంట్లో ప‌బ్జీ..అసెంబ్లీలో లాలీజో!

ఏపీలో నేడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల్లో స‌మావేశాల్లో భాగంగా తొలి రోజు స‌మావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు అంతా స‌మావేశాల్లో పాల్గొన్నారు. అయితే స‌మావేశం ప్రారంభ‌మైన కాసేప‌టికే టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. స‌రిగ్గా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌మ‌యంలోనే ఈ తంతు జ‌రిగింది. ఏపీలో త‌మ పార్టీ నేత‌ల‌పై జ‌రుగుతోన్న అరెస్ట్ ల కార‌ణంగా అంద‌రూ న‌ల్ల చొక్కాలు వేసుకుని నిర‌స‌న తెలిపి వాకౌట్ చేసారు. తాజాగా నేడు జ‌రిగిన అసెంబ్లీలో చోటు చేసుకున్న ఓ స‌న్నివేశాన్ని టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి లోకేష్ ట్వీట్ చేసారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీలో నిద్ర‌పోతున్న ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. గ‌త స‌మావేశాల్లో ఇలాగే నిద్ర‌పోయార‌ని ఇప్పుడు కూడా ఇలాగే నిద్ర‌పోతున్నార‌ని అర్ధం వ‌చ్చేలా జ‌గ‌న్ అనే నేను అసెంబ్లీలో అనే టైటిల్ పెట్టి వీడియోను రూపొందించారు. ఇంట్లో ప‌బ్జీ.. అసెంబ్లీలో లాలీజో అంటూ లోకేష్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. టీడీపీ నేత‌లు‌, కార్య‌క‌ర్త‌లు, ఫాలోవ‌ర్స్ దాన్ని పెద్ద ఎత్తున వైర‌ల్ చేస్తున్నారు. అస‌లే అరెస్ట్ ల‌తో మండిపోతున్న టీడీపీ నేత‌ల‌కు ఈ వీడియో దొర‌క‌డంతో కోతికి కొబ్బ‌రికాయ దొరికిన‌ట్లు అయింది.

ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట‌ర్ వంటి మాధ్య‌మాల్లో షేర్లు కొడుతూ జోరుగా వైర‌ల్ చేస్తూ సంబ‌ర‌ప‌డుతున్నారు. మ‌రి ఈ వీడియోపై వైకాపా నేత‌లు ఎలా స్పందిస్తారో? చూద్దాం. జ‌గ‌న్ ని ఏమైనా అంటే ఒంటికాలుపై దూసుకొచ్చే న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఈసారి ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే నేటి అసెంబ్లీ స‌మావేశంలో స‌ర్కార్ కీల‌క అంశాలు ప్ర‌స్తావించింది. అలాగే 2020-21 ఏడాదికి సంబంధించి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింది.