చంద్ర‌బాబు ఇంటి ముందు టీడీపీ నాయ‌కుడు ధ‌ర్నా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇంటి ముందు అదే పార్టీకి చెందిన వెంక‌టేశ్వ‌ర‌రావు అనే నాయ‌కుడు ఆందోళ‌న‌కు దిగాడు. నేరుగా చంద్ర‌బాబు ఇల్లైన జూబ్లీ హిల్స్ లోని ఇంటి ముందు భైఠాయించాడు. చంద్ర‌బాబు ఇంట్లోంచి వెంట‌నే బ‌య‌ట‌కు రావాల‌ని…లేదంటే ఆందోళ‌న తీవ్ర‌త‌రం చేస్తాన‌ని హెచ్చ‌రించాడు. ఇంత‌కీ వెంక‌టేశ్వ‌ర‌రావు బాబు ఇంటి ముందు ఎందుకు భైటాయించిన‌ట్లు? ఆ వెంక‌టేశ్వ‌ర‌రావు నేప‌థ్యం ఏంటి? అంటే! ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. వెంకటేశ్వ‌ర‌రావుని చంద్ర‌బాబు 30 ఏళ్ల పాటు రాజ‌కీయంగా వాడుకున్నారుట‌.

అత‌ను ఒక‌ప్పుడు జూబ్లిహిల్స్ కార్పోరేట‌ర్ గా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారుట‌. ఒక‌ప్పుడు త‌న‌తో చంద్ర‌బాబు ఎంతో స‌న్నిహితంగా మెలిగేవార‌ని..కానీ ఇప్పుడు ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. క‌ల‌వాల‌ని ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించినా క‌నీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేదుట‌. ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి అడిగితే సార్ బ‌య‌ట‌కు వెళ్లార‌ని సెక్యురిటీ సిబ్బంది రోజు చెప్పి పంపిచేస్తున్నారుట‌. దీంతో స‌హ‌నం కోల్పోయే ఈరోజు ఇంటి ముందు బైఠాయించిన‌ట్లు వెంక‌టేశ్వ‌ర రావు ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. ద‌య‌చేసి చంద్ర‌బాబులాంటి వ్య‌క్తిని న‌మ్మోద‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.

త‌నలాంటి బాధితులు తెలుగు రాష్ర్టాల్లో చాలా మంది ఉండి ఉంటార‌ని వాళ్లంతా బ‌య‌ట‌కు వ‌చ్చి చంద్ర‌బాబు బండారం బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేసారు.దాదాపు 30 సంవ్స‌త‌రాలు పాటు చంద్ర‌బాబు వెన‌కే ఉండి..పార్టీ కోసం ఎంతో ప‌నిచేసాన‌ని..కానీ త‌న అవ‌స‌రం ప‌డిన‌ప్పుడు చంద్ర‌బాబు త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నిజ‌స్వరూపం ఇప్పుడే బ‌య‌ట‌ప‌డింద‌ని..30 సంవ‌త్స‌రాల పాటు ఆయ‌న‌తో తిరిగినందుకు సిగ్గుప‌డుతున్నాని వెంక‌టేశ్వ‌రరావు దు‌య్య‌బెట్టారు.