టాక్ : “రాధే శ్యామ్” ట్రైలర్ రిలీజ్ కి గ్రాండ్ ప్లాన్స్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు డస్కీ హీరోయిన్ పూజా హెగ్డే లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “రాధే శ్యామ్”. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తున్నా ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉండగా ఈ సినిమా నుంచి సాంగ్స్ ఇతర అప్డేట్స్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఇంకో ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా నుంచి అద్భుతమైన ట్రైలర్ ను చిత్ర బృందం సిద్ధం చేస్తున్నారట. మరి దీనిని కూడా భారీ లెవెల్లో ప్రమోషన్స్ తో రిలీజ్ చెయ్యబోతున్నట్టు కూడా తెలుస్తుంది.

ఇంకా ఈ ట్రైలర్ కి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ ముంబై లో చేస్తారట. అంతే కాకుండా ఈ ఈవెంట్ కి గాను చిత్ర యూనిట్ తో పాటుగా పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ కూడా హాజరు అవుతారని ఇంకో టాక్. మొత్తానికి మాత్రం రాధే శ్యామ్ ట్రైలర్ కి మాత్రం గట్టి ప్లానింగులే ఉన్నాయని చెప్పాలి.