స‌ముద్రంలో బ‌ర్త్‌డే వేడుక‌లు.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

కరోనాతో దాదాపు ఏడు నెల‌ల పాటు ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌లకి వెళుతున్నారు. చాలా వ‌ర‌కు మాల్దీవుల‌కే వెళుతుండ‌గా, అక్క‌డి అందాల‌ని త‌మ కెమెరాల‌లో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డంతో పాటు కొద్ది క్ష‌ణాల‌లోనే ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకునేందుకు ఫ్యామిలీతో మాల్దీవుల‌కి వెళ్ళారు.

సముద్రంలో తేలియాడుతూ రుచిక‌ర‌మైన భోజనం ఆస్వాదిస్తూ కూతురు, భార్య‌తో ఆనంద క్ష‌ణాల‌ని గ‌డిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని రైనా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో పాటు “పుట్టినరోజు ఉదయం ఆ రుచికరమైన అల్ఫాహారంతో అత్యంత అందమైన సెట్టింగ్‌‌లో ప్రారంభించాం” క్యాప్షన్‌తో ప‌లు ఫొటోలు షేర్ చేశారు. వీటిని చూసి నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. రానా ప్ర‌స్తుతం 34వ వ‌సంతంలోకి అడుగుపెట్టి న సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానులు, నెటిజ‌న్స్‌, శుభాకాంక్ష‌లు తెలిపారు.

రైనాలో మంచి క్రికెట‌ర్‌తో పాటు మాన‌వత్వం కూడా దాగి ఉంది. ఇటీవ‌ల‌ 34 స్కూళ్ల‌లో శానిటేష‌న్‌, తాగు నీటి స‌దుపాయాలు క‌ల్పించేందుకు వాగ్ధానం చేశాడు. యూపీ, జ‌మ్మూ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉన్న ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఈ స‌దుపాయాల‌ను రైనా స్వంతంగా ఏర్పాటు చేయ‌నున్నాడు. ఈ ఏడాది ఆగ‌స్టు 15వ తేదీన అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రైనా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.