స్టార్ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్…. !

ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో జరిగిన రైడ్స్ లో స్టార్ క్రికెటర్ సురేష్ రైనా, గాయకుడు గురు రాంధవాను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ దాడిలో ముంబై క్లబ్‌కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేశారు.

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నిందితులపై కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసి కేసు నమోదు చేసిన వారిలో గాయకుడు గురు రాంధవా, క్రికెటర్ సురేష్ రైనా కూడా ఉన్నారని సహార్ పోలీస్ స్టేషన్ తెలిపింది. అనంతరం నిందితులను బెయిల్‌పై విడుదల చేశారు. క్రికెటర్ సురేష్ రైనాతో పాటు 34 మందిపై ఐపిసి సెక్షన్ 188, 269, 34, ఎన్‌ఎండిఎ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.