పథకాల రూపంలో ప్రజల డబ్బులు ప్రజలకే ఇస్తున్నాం అంటున్నా స్పీకర్ తమ్మినేని..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం తాజాగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని.. ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అని అన్నాడు.

వెనుకబడిన కులాలకు ఈ ప్రభుత్వం న్యాయం చేసిందా లేదా అన్నది ప్రజలే ఆలోచించాలి అని ప్రశ్నించాడు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా కూడా గ్రహించాలి అని.. సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాలకు పదవులు ఇవ్వడంలో జగన్ న్యాయం చేశాడని అన్నాడు. ప్రతి పథకానికి నేరుగా లబ్ధిదారునికి అందించి అవినీతి లేని పాలన అందిస్తున్నారని అన్నాడు.