Padutha theeyaga: పాడుతా తీయగా షోలో ఎక్స్ పోజింగ్ చేయాలి….చీకటి కోణం బయట పెట్టిన సింగర్!

Padutha theeyaga: పాడుతా తీయగా గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంది సింగర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రణ్యం గారు ఈ కార్యక్రమంలో జడ్జిగా ఉండేవారు. అయితే ఆయన మరణం తరువాత ఈ కార్యక్రమానికి చంద్రబోస్, కీరవాణి, సునీత జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే 2024 ఈ కార్యక్రమ విన్నర్ ప్రవస్థి సోషల్ మీడియా వేదికగా ఒక సంచలనమైన వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో భాగంగా ఈమె జడ్జిల వ్యవహార శైలి గురించి అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రవస్తి మాట్లాడుతూ ఈ కార్యక్రమం బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడు ఉన్న విధంగా లేదు. ప్రస్తుతం ఉంటున్న జడ్జిలు నన్ను చాలా చీప్ గా చూసారు. ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తున్నారు. ముఖ్యంగా సునీతకు నేనంటే అసలు పడదు. ఆమె కీరవాణి గారికి నా గురించి లేనిపోనివన్నీ నెగిటివ్గా చెప్పేవారని ఒకసారి ఆమె మైక్ ఆఫ్ చేయకుండా నా గురించి నెగిటివ్గా కీరవాణి గారికి చెప్పడం నేను విన్నాను అని తెలిపారు.

ఇతర కంటెస్టెంట్లు లిరిక్స్ మర్చిపోయిన వారికి పాజిటివ్గా జడ్జిమెంట్ ఇస్తారు కానీ నేను పర్ఫెక్ట్ గా పాడిన నాకు నెగిటివ్ జడ్జిమెంట్ ఇస్తారని తెలిపారు. ఇక ప్రొడక్షన్ వర్క్ చాలా వరస్ట్ గా ఉందని తెలిపారు. వాళ్ళు మాకు కాస్ట్యుమ్స్ ఇచ్చి నడుము కిందికి శారీ కట్టుకోండి, ఎక్స్ ఫోజింగ్ చేయండి అని చెబుతారు. కాస్ట్యూమ్ డిజైనర్ అయితే.. నీకున్న బాడీకి ఇంకేమి ఇవ్వగలను అంటూ అసభ్యంగా మాట్లాడాడు. వీళ్ళ మాటల వల్ల నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. బాలు సార్ గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడు మొత్తం చెత్తలాగా మారిపోయింది. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి పాడుతా తీయగా షో వరస్ట్ గా మారిందనీ ప్రవస్థి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.