వైరల్ పోస్ట్ : ‘RRR’ స్టార్టై నాలుగేళ్లు అయ్యిందా..?

సౌత్ ఇండియన్ సినిమా నుంచి వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్(RRR) పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి లాంటి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు చరణ్ ఎన్టీఆర్ లతో టేకప్ చేసిన సినిమా ఇది. దీనితో ఈ సినిమాపై అప్పుడు నుంచే ఎనలేని హైప్ నెలకొంది.

అయితే అసలు ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఈరోజుతో నాలుగేళ్లు కంప్లీట్ అయ్యిపోయిందట. సరిగా ఇదే రోజు నాలుగేళ్లు కింద రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిపి ఓ పిక్ పెట్టడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇప్పుడు దానితో ఈ సినిమా RRR బృందం ఇపుడు చేసిన పోస్ట్ మరింత వైరల్ అవుతుంది.

అప్పట్లో రాజమౌళి పెట్టిన ఈ పోస్ట్ ఎన్నో స్పెక్యులేషన్స్ కి దారి తీసింది. సినిమా స్టార్ట్ చేసి మూడేళ్లు అయ్యింది. ఈ బిగ్గెస్ట్ థ్రిల్లర్ ని ఇండియన్ సినిమా దగ్గర ప్రెజెంట్ చేసుందుకు ఈరోజు నుంచి 50 రోజులు మాత్రమే మిగిలి ఉంది అని ఆసక్తికర పోస్ట్ చేసారు. దీనితో ఈ సినిమా మొదలై నాలుగేళ్లు అయ్యిపోయిందా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.