కుదుటపడ్డ బుల్లితెర నటి శ్రీవాణి ఆరోగ్యం.. ఆనందంలో అభిమానులు..?

బుల్లితెర ప్రసారమైన ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించిన బుల్లితెర నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. టీవీ సీరియల్స్ లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్రీవాణి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తరచు హోమ్ టూర్ వీడియోలు షాపింగ్ వీడియోస్ మేకప్ వీడియోస్ అంటూ రోజులో తను చేసే ప్రతి విషయాన్ని వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎంతోమంది ఫాలోవర్స్ ని పెంచుకుంది.

అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీ వాణి తన గొంతు కోల్పోయింది. కొంతకాలం క్రితం అరుదైన వ్యాధి బారిన పడడంతో ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. ఈ క్రమంలో వైద్యులను సంప్రదించటంతో కొంచెం గట్టిగా మాట్లాడినా ఆమె గొంతు శాశ్వతంగా మూగబోతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో శ్రీ వాణి నెలరోజుల నుంచి ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తాజాగా నెలరోజులు పూర్తి కావటంతో డాక్టర్ ని సంపద్రించిన శ్రీ వాణీ కి డాక్టర్లు శుభవార్త చెప్పారు. అరుదైన వ్యాధి కోసం తాను తీసుకున్న చికిత్స విజయవంతమైందని ఇకపై ఎప్పటిలాగే తాను మాట్లాడవచ్చు అని డాక్టర్లు వెల్లడించారు.

తాజాగా ఈ విషయాన్ని శ్రీ వాణీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవాణి మాట్లాడుతూ… దాదాపు నెల రోజులపాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే కాలం గడిపానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఎంతోమంది అభిమానులు తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేశారని వెల్లడించింది. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. శివాని ఆరోగ్యం కుదుటపడి మళ్లీ మాట్లాడటంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.