అయినవారి చేతిలో దారుణంగా మోసపోయిన శేఖర్ మాస్టర్…!

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట ఢీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న శేఖర్ మాస్టర్ ఆ తర్వాత డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొంది అదే షోలో చాలా కాలం జడ్జిగా వ్యవహరించారు. ఢీ షో ద్వారా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో కూడా కొంతకాలం జడ్జిగా వ్యవహరించి కమెడియన్స్ తో పాటు పంచ్ లు వేస్తూ తన టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇలా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలలో సందడి చేస్తూ పాపులర్ అయిన శేఖర్ మాస్టర్ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేశాడు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మాస్ క్లాస్ అని తేడా లేకుండా తన సిగ్నేచర్ మార్క్ ఉండేలాగా శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. దీంతో స్టార్ హీరో సినిమా మొదలైందంటే కచ్చితంగా శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఆ సినిమాలో కనిపించాల్సిందే అనే స్థాయికి ఎదిగాడు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో శేఖర్ స్టూడియోని స్థాపించి సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా డాన్స్ వీడియోలు చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. ఇలా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎదుగుతూ శేఖర్ మాస్టర్ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

ఇదిలా ఉండగా శేఖర్ మాస్టర్ జీవితంలో అన్నీ విజయాలే కాకుండా ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తాను కష్టపడి సంపాదించిన డబ్బు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలో తాను మోసపోయిన విషయాన్ని గురించి శేఖర్ మాస్టర్ వెల్లడిస్తూ.. తనకి తెలిసినవారు పరిచయం చేసిన వ్యక్తిని నమ్మి అప్పు చేసి మరి భూమిని కొన్నాను. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే దారిలో ఉన్న ఆ భూమి వ్యాల్యూ ఎక్కువగా ఉందని భవిష్యత్తులో మరింత విలువ పెరిగే అవకాశం ఉందని నమ్మించి నా దగ్గర నుండి డబ్బు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అప్పులు తీర్చడానికి డబ్బు అవసరమై ఆ భూమిని అమ్మటానికి వారికి ఫోన్ చేస్తుంటే కనీసం ఫోన్ కూడా తీయడం లేదు. అయినవారే కదా అని నమ్మి డబ్బులు ఇస్తే నన్ను ఇంత మోసం చేశారు అంటూ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.