ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి!

భారత్‌కు చెందిన మరో విద్యార్థి ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. అతను అనారోగ్యంతో మ‌ృతి చెందినట్లుగా తెలుస్తోంది. పంజాబ్‌లోని బర్నాలా ప్రాంతానికి చెందిన చందన్‌ జిందాల్‌(22) ఉక్రెయిన్‌లోని విన్నీసియాలో మోమోరియల్ మెడికల్‌ యూనివర్శిటీలో వైద్య విద్యా అభ్యసిస్తున్నాడు. ఫిబ్రవరి 2న చందన్‌ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న సమయంలో బ్రెయిన్‌ స్ట్రోక్ రావడంతో శస్త్రచికిత్స కూడా చేశారు. తాజాగా అతని ఆరోగ్యం విషమించి నిన్న రాత్రి చందన్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు