వైసీపీ నేతల ప్రచారంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సత్య కుమార్..

తాజాగా బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ వైసీపీ నేతల ప్రచారం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంగా బీజేపీ నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం బాగా పోరాడుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన పలువురు నేతలతో రైతులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ ప్రచారం వీధికో ఎమ్మెల్యే, గ్రామనికో మంత్రి అనే చందంగా సాగుతుంది అని అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడం వల్లే ఈ తరహా ప్రచారం చేస్తుంది అని అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు రాష్ట్ర కేబినెట్ లో ఉన్నా కూడా జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు అని విమర్శలు చేశారు.