నిహారిక పెళ్ళిలో సాయిధ‌ర‌మ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ఏం జరిగింది?

డిసెంబ‌ర్ 9న ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా నిహారిక‌, చైత‌న్యల వివాహం ఘ‌నంగా జ‌రిగింది. మెగా హీరోలు అందరు ఈ పెళ్ళి వేడుక‌కు హాజ‌రు కాగా, ఆ ప్రాంగ‌ణం కోలాహాలంగా మారింది. సంగీత్‌, పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌డంతో ఆయ‌న ప్ర‌తి మూవ్‌మెంట్‌ని మెగా అభిమానులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ఓ సంద‌ర్భంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న మామ చేతిని ప‌ట్టుకొని సంభాషిస్తుండగా, అది ఏ స‌మ‌యంలో జ‌రిగిందో అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఉత్సుక‌త చూపించారు.

డిసెంబ‌ర్ 25న సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రం విడుద‌ల కానుండగా, ఈ సినిమాకి సంబంధించి ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు తేజూ. ఇందులో భాగంగా యాంకర్.. నిహారిక పెళ్ళి స‌మ‌యంలో పవ‌న్ తో జ‌రిగిన సంభాష‌ణ గురించి అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన సాయిధ‌ర‌మ్.. నేను మామ ఓ ఫోటో అని అడిగాను. దానికి ఆయ‌న ఏరా నాతో ఇంత‌క‌ముందు ఎప్పుడు ఫొటో దిగ‌లేదా అంటూ చ‌మ‌త్క‌రించారు. దీంతో అక్క‌డ న‌వ్వులు పూశాయి అని పేర్కొన్నారు. తేజూ చిన్నప్పుడు ప‌వ‌న్ ద‌గ్గ‌రే ఎక్కువ పెరిగాడు. అందుకే ప‌వ‌న్‌తో చాలా చ‌నువుగా కూడా ఉంటాడు.

ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్ర ప్రమోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబ‌ర్ 25న విడుద‌ల కానుండ‌గా, క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్‌లో వ‌స్తున్న తొలి సినిమా ఇదే. చాలా రిస్క్ చేసి తేజూ ఈ సినిమా విడుద‌ల చేస్తుండగా, ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్ క‌థానాయిక‌గా న‌టించింది.