పెళ్లయిన పది రోజులకే పరలోకానికి వెళ్లిన వధువు.. వరకట్నమే కారణమా..?

ఒక యువతి ఈ యువకుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన నెలరోజులకే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది అసలేం జరిగిందంటే…బీహార్ లోని మధుబని జిల్లా ఘోగర్దిహ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపట్టి గ్రామానికి చెందిన రామచంద్ర పాశ్వాన్‌ కుమార్తె కామిని కుమారి. 21 ఏళ్ల ఈ యువతి పస్త్‌వర్‌ గ్రామానికి చెందిన మనీష్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది.గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ జంట పెద్దలకు తెలియకుండా వీళ్లిద్దరూ సరదగా సినిమాలకు, షికార్లకు వెళ్లేవారు.

ఇద్దరూ మేజర్ లే కావడంతో ఇటీవల పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పారు.ఇరు కుటుంబాలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాయి. మనీష్,కామిని ఇంట్లో నుంచి వెళ్లిపోయి అక్టోబర్ 21, 2021న గుడిలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న మనీష్ కామినితో కలిసి సహర్సాలోని ఓ హోటల్‌లో పది రోజుల పాటు ఉన్నారు. మనీష్ కొద్దిరోజుల క్రితం భార్యను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.మూడు నాలుగు రోజులు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి అత్తింటి, తన భర్త నుంచి కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. మనీష్, అతని తల్లి, సోదరుడు రాజీవ్, అతని భర్త కామినిని వేధింపులకు గురిచేశారు.

అమ్మానాన్నలను కాదనుకుని మనీష్‌ను నమ్మి పెళ్లి చేసుకుంటే ఇలా జరగడం పట్ల కామిని తీవ్ర మనస్తాపానికి లోనైంది.ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన స్పందన లేదు.ఉమెన్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సాయం కోరింది. కానీ.. ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో.. కామినికి ఎటు చూసినా అంధకారమే కనిపించింది. ఈ క్రమంలో మంగళవారం నాడు కామిని అత్తారింట్లో శవమై కనిపించింది. విషం తాగి చనిపోయినట్లు అత్తింటి వారు చెబుతున్నప్పటికీ ఆమెకు విషం పెట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే వాదన కామిని తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.