Suicide: వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య…!

Suicide: ప్రతి ఆడపిల్ల వివాహం చేసుకున్న తర్వాత అత్తవారింట్లో అడుగు పెట్టి ఎంతో సంతోషంగా జీవించాలని ఎన్నో కలలు కంటుంది. కానీ కొందరి ఆడపిల్లల జీవితంలో ఆ కలలు కలలుగా మిగిలిపోతాయి.అనేక కారణాల వల్ల కొందరు అత్తింటి వారు నానా హింసలకు గురి చేస్తూ ఉంటారు. వరకట్న వేధింపులు భరించలేక కొందరు ఆడపిల్లలు అత్తింటివారిపై ఎదురు తిరుగుతుంటె మరికొందరు మాత్రం అత్తింటి వారికి ఎదురు తిరగలేక పుట్టింటి వారికి భారం కాలేక మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే…యాతవీధికి చెందిన పోలవరపు మూర్తి, వసంత ప్రేమించుకుని 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు. వివాహం జరిగిన తర్వాత కొంతకాలం సాఫీగా సాగిపోయిన వీరి జీవితంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఇస్తానన్న కట్నం తీసుకురావాలని అంటూ గత కొంతకాలంగా మూర్తి తన భార్యను తరచూ వేధించేవాడు.వెల్డింగ్ పనుల నిమిత్తం 10 రోజులలో దుబాయ్ వెళ్ళవలసి ఉండగా ఖర్చులకోసం డబ్బులు తీసుకు రావాలని మరి మీద ఒత్తిడి చేశాడు.

ఈ క్రమంలో మంగళవారం అందరూ అమ్మ వారి పండుగ జరుపుకొని రాత్రి భోజనాలు చేసి నిద్రపోయారు. వసంత మాత్రం మనస్థాపంతో వేధింపులు భరించలేక ఎలాగైనా తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించి అందరూ నిద్రించిన తర్వాత ఒక ఇంట్లో స్తంభానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భర్త లేచి చూడగా వసంత సమాజానికి వేలాడుతూ కనిపించడంతో కింది గురించి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది.

మూర్తి వసంత తల్లిదండ్రులకు ఫోన్ చేసి కూతురు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పి పిలిపించాడు. కానీ అసలు తల్లిదండ్రులు తమ అల్లుడే కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.