Sabarimala Prasadam: ఇంటికే అయ్యప్ప స్వామి ప్రసాదం

Sabarimala Prasadam: కేరళలో కొలువై ఉన్న శబరిమల అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం ఎంతో మహిమ గలది. అంతేకాకుండా చాలా ప్రఖ్యాతి గాంచింది. ప్రతీ సంవత్సరం కార్తీక మాసం లో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఆయన సన్నిధాన సందర్శనం కి వెళ్తారు భక్తులు. ప్రతీ యేటా ఒక్కసారే వెళ్తారు కాబట్టి అక్కడ దొరికే శబరిమల అరవణ ప్రసాదంకి చాలా డిమాండ్ ఉంది.

శబరిమల అరవణ ప్రసాదమెంతో రుచిగా వుంటుంది. దీన్ని బియ్యం, బెల్లం, నెయ్యిలతో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా. శరీరంలో వేడి నింపుతుంది. కాబట్టి చలికాలంలో తింటే మంచి ఉపయోగం వుంటుంది. సీజనల్ ఫ్రూట్స్ లాగా సీజనల్ ప్రసాదం కింద దీన్ని బాగా తినొచ్చు.

అరవణ ప్రసాదానికి వాడే బియ్యం మావెల్లిక్కర ట్రావెన్కోర్‌ దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. వీటితో ఏటా 80 లక్షల ప్రసాదాలను తయారు చేస్తారు. తిరుపతి, షిర్డీ క్షేత్రాల్లా ఎక్కువమంది భక్తులు దర్శించుకునే ఆలయం శబరిమల. అందుకే తిరుమల లడ్డూ తరువాత, అయ్యప్ప స్వామి ప్రసాదానికి అంత ప్రాధాన్యత ఉంది.

కరోనా కారణంగా శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో తపాలా శాఖ అరవణ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. అప్లికేషన్‌ ఫారంలో పూర్తి పేరు, చిరునామా రాసి పోస్ట్‌ ఆఫీస్‌లో 450 రూపాయలు చెల్లిస్తే శబరిమల కిట్టు మీ ఇంటికే వస్తుంది. ఇందులో అరవణ ప్రసాదం, నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, అర్చన ప్రసాదం ఉంటాయి.