RRR : మరికొన్ని రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేందుకు వస్తున్న భారీ ట్రిపుల్ ఆర్(RRR). ఇద్దరు మాస్ హీరోస్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడుతుండగా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు హీరోల అభిమానులు అయితే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎగ్జైటింగ్ సమయంలో ఈ సినిమా బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు మోసపోతున్నారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ వైరల్ గా మారింది.
ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి టికెట్స్ ఇలా ఆన్లైన్ లో పెట్టిన వెంటనే మెరుపు వేగంతో అయ్యిపోతున్నాయి. అయితే ఇక్కడే ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఈ సినిమా టికెట్స్ అక్కడక్కడా తెలుగు స్టేట్స్ లో సడెన్ గా బుకింగ్ కి ఓపెన్ అవుతుండగా ఫ్యాన్స్ వెంటనే బుక్ చేసుకొని తర్వాత నాలుక కరుచుకుంటున్నారు.
ఎందుకంటే ఆన్లైన్ లో మొదట ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చ్ 25 పెట్టకుండా బుకింగ్ యాప్స్ వారు మార్చ్ 26, 28 ఇలా పెడుతున్నారు. దీనితో 25 కే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అనుకోని అభిమానులు డేట్ చూస్కోకుండా బుక్ చేసేస్తున్నారు. కానీ తీరా చూస్తే డేట్ 25 కాదని గ్రహించి షాకవుతున్నారు. దీనితో ఇలా ఫన్నీ గా వారు మోసపోతున్నారు. అందుకే ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అంతా కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్..
