RRR : సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల్ని తగ్గించడంపై వివాదం చెలరేగుతోంది. నిజానికి, సినీ అభిమానులెవరూ సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచడాన్ని ఇష్టపడరు. ఎందుకంటే, తక్కువ ధరకే వినోదాన్ని కోరుకుంటారు ఎవరైనా. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అభిమాన హీరో సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడానికో.. ఇంకో హంగామా కోసమో మాత్రమే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఇక, నిర్మాతల ఆవేదన వేరేలా వుంది. భారీగా ఖర్చు చేసిన సినిమాలకీ, తక్కువ ఖర్చు చేసిన సినిమాలకీ ఒక్కటే టిక్కెట్ ధర అంటే ఎలా.? అన్నది వారి ఆవేదన. ఎగ్జిబిటర్ల సమస్య ఇంకోలా వుంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో థియేటర్ల నిర్వహణ భారంగా మారిందనీ, కాబట్టి తక్కువ ధరలతో సినిమా టిక్కెట్లు అమ్మడం వల్ల తమ జీవితాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు ఎగ్జిబిటర్లు.
ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి, అలాగే ‘రాధేశ్యామ్’ సినిమాకీ టిక్కెట్ల ధరలు మూడొందల వరకు పెరుగుతాయనే ప్రచారం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
‘ఇది మరీ దారుణం బాసూ..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయా హీరోల అభిమానులే వాపోతున్నారు. ‘ఎక్కువ థియేటర్లలో వేసుకోండి.. అదనపు షోల కోసం అనుమతులు తెచ్చుకోండి.. అంతే తప్ప, టిక్కెట్ల ధరలు పెంచుతామనడం ధారుణం..’ అంటూ అభిమానులు మండిపడుతున్నారు.
సో, వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్ సాధించిందన్నమాట. జగన్ సర్కారు ఆలోచనే కరెక్ట్.. అని సినీ అభిమానులు చెప్పే పరిస్థితి వస్తోందిప్పుడు
