దుబాయ్‌లో ఫ్యామిలీతో రోజా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు.. ఫొటోలు వైర‌ల్

90ల కాలంలో స్టార్ హీరోయిన్‌గా వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన భామ రోజా. చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి స్టార్ హీరోస్ అంద‌రితో న‌టించింది. బాబు మోహ‌న్‌తో కూడా ఓ సాంగ్‌లో ఆడి పాడింది. అయితే సెల్వ‌మ‌ణితో వివాహం త‌ర్వాత సినిమాల‌ని కాస్త త‌గ్గించిన రోజా బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు రాజ‌కీయాల‌లో త‌న హవా చూపిస్తూ వ‌స్తుంది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో 48వ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుపుకున్న రోజా ఆ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఎంత‌గానో అల‌రించింది.

రాజ‌కీయాలు, షోస్‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీతో విలువైన స‌మ‌యం కేటాయిస్తూ వ‌స్తుంది. 1992లో ఇవివి సత్యనారాయణ సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పగా, ప‌దేళ్ల‌కు అంటే 2002లో వీరి వివాహం జ‌రిగింది. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వ‌స్తున్న రోజా, సెల్వ‌మ‌ణి దంప‌తుల‌కు ఓ అబ్బాయి, అమ్మాయి సంతానంగా ఉన్నారు. రోజా భ‌ర్త ప్ర‌స్తుతం సెల్వమణి తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు.

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ని సెల‌బ్రేట్ చేసేంద‌కు రోజా, సెల్వ‌మ‌ణి ఫ్రెండ్స్‌తో క‌లిసి దుబాయ్ వెళ్ళారు. అక్క‌డ ఆహ్లాద‌క‌ర‌మైన వాతావర‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు. డిసెంబ‌ర్ 30 రాత్రి దిగిన ఫొటోల‌ను రోజా త‌న ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేయ‌డంతో అవి ఫుల్ వైర‌ల్‌గా మారాయి. ముఖ్యంగా త‌న పిల్ల‌ల‌తో క‌లిసి రోజా దిగిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.