ఆది మీద తన మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టిన బుల్లితెర నటి… ఆది ఏం చేశాడో తెలిస్తే షాక్…!

జబర్దస్త్ ద్వార ఎంతో మంది కామెడియన్ లుగా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. మొదట మామూలు కంటెస్టెంట్ గా జబర్ధస్త్ లో కి వచ్చిన ఆది తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ రేటింగ్స్ మరింత పెరిగాయి అనటంలో సందేహం లేదు. జబర్దస్త్ ద్వార ఫేమస్ అయిన ఆది బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో షో లలో సందడి చేస్తూ ప్రేక్షకులని తన మాటలతో నవ్విస్తున్నాడు. ప్రస్తుతం ఆది టీవి షోస్ తో పాటు పలు సినిమాలలో కూడ నటిస్తున్నాడు. ఆది హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆది ప్రస్తుతం ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షో లలో సందడి చేస్తున్నాడు. సుధీర్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ షో మారటంతో ఆది ఒక్కడే ఒంటిచేత్తో ఈ షోని ముందుకు నడిపిస్తున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ వీడియో లో బుల్లితెర నటి, జబర్ధస్త్ కామెడీయన్ రీతు చౌదరి ఆది మీద తన మనసులో దాగి ఉన్న ప్రేమని బయట పెట్టింది. ఈ క్రమంలో నూకరాజు మాట్లాడుతూ.. ‘నువ్వు ఇదివరకే ఒకరిని హగ్ చేసుకుని ప్రేమిస్తున్నా అన్నావు… ఇటీవల అజార్‌ను లవ్ చేస్తున్నా అని చెప్పావు. ఇంతకీ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో తెలుసుకోవచ్చా’ అని అడిగాడు.

దీంత రీతూ చౌదరి తన మనసులో ఉన్న విషయం చెప్పింది . నా మనసులో ఆది ఉన్నాడు అంటూ చెప్పి, ఆది చెయ్యి పట్టుకొని ప్రపోజ్ చేసింది. రీతు అలా ప్రపోజ్ చేయటంతో ఆదితో పాటు అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. రీతు ప్రపోస్ గురించి ఆది స్పందిస్తూ నా మనసులో నీ మీద ఎటువంటి ఉద్దేశం లేదు అంటూ తిరస్కరించాడు. దీంతో రీతు అక్కడినుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. దీంతో రష్మి అక్కడికి వచ్చి ఆదిని కొట్టింది. తర్వత రీతు వచ్చి కేవలం టీఆర్పీ కోసం చేశామని అసలు విషయం చెప్పింది.