‎Rithu Chowdary: రీతూ చౌదరితో రిలేషన్ పై స్పందించిన ధర్మ మహేష్.. ఆయన రియాక్షన్ ఇదే!

Rithu Chowdary: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్, లేడి కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు షోస్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ప్రస్తుతం రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రీతూ పై టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో రీతూ అఫైర్ పెట్టుకుందంటూ ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు కూడా షేర్‌ చేసింది.

‎ముఖ్యంగా తాను గర్భంతో ఉన్నప్పుడు మహేశ్, రీతూ బాగా దగ్గరైపోయారని గౌతమి తెలిపింది. ప్రస్తుతం ధర్మ మహేష్, రీతూ చౌదరీల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే బయట జరుగుతున్న ఈ వ్యవహారం గురించి బిగ్ బాస్ లో ఉన్న రీతూ చౌదరికి తెలిసే అవకాశం లేదు. అయితే గౌతమి ఆరోపణలు, రీతూ చౌదరితో రిలేషన్ షిప్ లపై హీరో ధర్మ మహేశ్‌ స్పందించాడు. ఒక మీడియాతో ధర్మా మహేష్ మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ.. బయట ఎవరో ఏదో అనుకుంటున్నట్లు నాకు, రీతూకు మధ్య ఏం లేదు.



‎ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే. తనను ఒక ఫ్రెండ్‌ లా మాత్రమే చూస్తాను. మా బెడ్‌రూమ్‌ ఫుటేజీలు ఉన్నాయని అంటోంది కదా.. కావాలంటే రీలీజ్‌ చేసుకోమనండి. గౌతమి నా కొడుకుని నాకు చూపించడం లేదు. ఈ వ్యవహారంతో నేను పూర్తిగా డిప్రెషన్‌ లో మునిగిపోయాను. సెటిల్మెంట్‌ చేస్తేనే నా బిడ్డను చూపిస్తామని అన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇంటిని కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్‌ వ్యాపారం చేస్తానని అబద్ధాలు చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్‌ తీసుకోవడం కాదు కదా, కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే ఆమె విడాకులు కావాలంటోంది కదా. అందుకు నేను కూడా రెడీగా ఉన్నాను. ప్రశాంతంగా విడిపోదామని అంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్‌ చెప్పుకొచ్చాడు. మరి మహేష్ వాఖ్యలపై అతని భార్య గౌతమి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.