రెస్టారెంట్ బంపర్ ఆఫర్ : భోజనం తినేయండి .. బుల్లెట్ బైక్ గెలుచుకోండి !

కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యాపారాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అందులో హోటల్ వ్యాపారం మరింత తీవ్రంగా నష్టాలపాలైంది. ఈ నేపథ్యంలో మళ్లీ బిజినెస్ ను గాడిలో పెట్టడానికి పూణేలోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న ఆలోచన చేసింది. భారీ భోజనం పూర్తి చేసిన వారికి బుల్లెట్ బైక్ ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ తెచ్చింది పుణెలోని శివాజీ హోటల్. ఒకవేళ రాయల్ ఎన్​ఫీల్డ్ బుల్లెట్ గెలుచుకోవాలంటే ఒక్క నిబంధన పెట్టింది. 60 నిమిషాల్లో 4కిలోల నాన్​వెజ్ భోజనాన్ని పూర్తిగా తినాలి.

Custom made Bikes, Royal enfield modification, Customized cars, India,  Puranam Designs

ఇలా చేస్తే విజేతకు రూ.1.65లక్షలు విలువ చేసే బుల్లెట్​ను బహుమతిగా ఇస్తోంది. ఎక్కువ మంది హోటల్​కు వచ్చి తినేందుకు ఈ ఆఫర్​ను తీసుకొచ్చామని రెస్టారెంట్​ యజమాని అతుల్ వాకర్ చెప్పారు. పుణెలోని వాడ్​గావ్​ మావల్ ప్రాంతంలో ఈ హోటల్ ఉంది.ఈ పోటీ కోసం ఐదు కొత్త బుల్లెట్ బైక్​లను రెస్టారెంట్​లో సిద్ధంగా ఉంచారు.

బ్యానర్​ను ఏర్పాటు చేయడంతో పాటు బుల్లెట్ భోజనంలో ఏమేం ఉంటాయో మెనూ సైతం పెట్టారు. నిబంధనలు కూడా ప్రస్తావించారు. ఈ కాంటెస్ట్​కు మంచి స్పందన వస్తోందని, చాలా మంది పాల్గొంటున్నారని యజమాని అతుల్ వైకర్ చెప్పారు. కాగా ఈ బుల్లెట్ భోజనం ధర రూ.2500. ఇప్పటి వరకు ఈ పోటీలో గెలిచి ఒక్కరు బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నారట. ఇక భారీ భోజనం లో మొత్తం 12 రకాల వంటకాలు 4కేజీల బరువుతో ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పొంఫ్రెట్ ఫ్రైడ్​ ఫిష్​, చికెన్ తందూరి, డ్రై మటన్​, గ్రే మటన్​, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ.. మరికొన్ని ఉన్నాయి.