దారుణం….కోడలి కాళ్లు చేతులు కట్టేసి రుతుస్రావ రక్తాన్ని మాంత్రికుడికి అమ్మేసిన అత్తమామలు!

ఆడదానికి ఆడదే శత్రువు అన్న మాటలో 100% నిజం ఉంది. ప్రస్తుత కాలంలో మగవారి నుండి ఆడవారికి రక్షణ కరువబడ్డమే కాకుండా సాటి మహిళల నుండి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా అత్తా కోడళ్ళ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అత్తా కోడళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఈ గొడవల వల్ల ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కోడలి మీద ఉన్న కోపంతో అత్త ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఋతుస్రావం రక్తాన్ని మంత్రగాడికి అమ్మిన ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే..పూణేకు చెందిన 27 ఏళ్ల యువతి రెండు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని బీడ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో అత్తింటి వారితో కలిసి నివసిస్తుంది. అయితే కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కోడలు అంటే మొదటి నుండి అత్తమామలకు ఇష్టం లేదు. దీంతో తరచూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఇటీవల వారి దారుణాలు మితిమీరిపోయి కొడుకు ఇంట్లో లేని సమయంలో అత్త,మామ ఆమె కాళ్లు చేతులు కట్టేశారు.

ఆ తర్వాత ఆమె రుతుస్రావం రక్తాన్ని దూదితో సీసాలో సేకరించి ఓ మంత్రగాడికి రూ. 50 వేలకు అమ్మేశారు. అయితే అత్తగారింట్లో జరిగిన ఈ దారుణాన్ని భరించలేని మహిళ పుట్టింటికి చేరుకుని జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ పట్ల దారుణానికి పాల్పడిన అత్తమామలను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.