Renu Desai: డిన్నర్ కోసం బయటికి వెళ్తున్నా అంటూ పోస్ట్ చేసిన రేణు దేశాయ్?

Renu Desai: కరోనా మహమ్మారి మరొకసారి కోరలు చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్ అందరి గుండెల్లో గుబులు రేపుతోంది. సామాన్యుల తో పోల్చుకుంటే సెలబ్రిటీలే ఎక్కువగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. కొందరు క్వారంటైన్ లో ఉంటు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ భార్య నటి రేణు దేశాయ్ కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే.రేణు దేశాయ్ తో పాటు కొడుకు అకీరా కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇక ఇదే విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. హలో కరోనా సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ.. న్యూ ఇయర్ వేడుకల సమయంలోను ఇంట్లోనే ఉండు కూర్చున్నప్పటికీ నాలోనూ, అకీరానందన్ లో కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం మేము ఇద్దరం కరోనా నుంచి కోలుకున్నామ్ అంటూ రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న రేణు దేశాయ్ బయటకు వచ్చింది. కరోనా నుంచి కోలు కోవడంతో డిన్నర్ కోసం అలా బయటికి వెళ్లిందట రేణుదేశాయ్.

కరోనా తరువాత ఇలా డిన్నర్ కోసం బయటకు వెళ్లడం చాలా కొత్తగా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. అసలే క్వారంటైన్ అంటూ నాలుగు గోడల మధ్యే ఉండటంతో పిచ్చెక్కిపోయి ఉంటుంది. మొత్తానికి ఇలా బయటి ప్రపంచాన్ని చూస్తుండటంతో సంతోషమేసినట్టుంది. ఇటీవలే బుల్లి తెర పైకి రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ దేశాయ్. అంతేకాకుండా త్వరలోనే వెండితెరపై కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆమె అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు.