మగాళ్లను అంత మాట అనేసింది రెజినా

తెలుగు లో 2012 లో SMS సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజినా కాసాండ్రా. మొదటి సినిమా హిట్ అవ్వకపోయినా….నటనకు మంచి మార్కులే పడ్డాయి రెజినా కి. మత్తెక్కించే కళ్ళు, అందం, అభినయం అన్నీ ఉన్నా కానీ రెజినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

రెజినా తో పాటే కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్ మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ రెజినా మాత్రం మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్, అప్పుడప్పుడు ఏవో కొన్ని చిన్న సినిమాల్లో నటిస్తుంది రెజినా.

రీసెంట్ గా రెజినా  ‘శాకిని ఢాకిని’ అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో నివేధిత థామ‌స్ కూడా న‌టించింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో రెజీనా, నివేధిత ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో రెజీనా మగాళ్ల మీద కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఇంట‌ర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ….అబ్బాయిల మీద నాకు పెద్ద జోక్ ఉంది. కానీ ఇక్క‌డ నేను చెప్ప‌కూడ‌ద‌ని అనుకుంటునున్నాను అంటూనే చెప్పేసింది. మేల్ యాంక‌ర్ త‌న‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌గా రెజీనా అత‌డితో అబ్బాయిలు, మ్యాగీ రెండూ ఒక్క‌టే రెండు నిమిషాల్లో అయిపోతారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

డ‌బుల్ మీనింగ్ జోక్ చెప్ప‌డ‌మే కాకుండా నీకు అర్థం అయ్యిందా అంటూ ఆ మేల్ యాంక‌ర్ ను అడిగింది రెజినా.