బాలీవుడ్‌కు వెళ్లిందో లేదో ముంబైలో కాస్ట్‌లీ ఫ్లాట్ కొనేసిన క‌న్న‌డ ముద్దుగుమ్మ‌

ఈ కాలం నాటి అందాల భామ‌లంద‌రు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న స‌మ‌యంలో విప‌రీతంగా రెమ్యున‌రేష‌న్ పెంచి భారీగా దండుకుంటున్నారు. నిర్మాత‌లు చేసేదేం లేక కొంద‌రు భామ‌లు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. అయితే వీరు లైఫ్‌ను స‌రిగ్గా ప్లాన్ చేసుకుంటూ హైద‌రాబాద్‌, ముంబైల‌లో కాస్ట్‌లీ ఫ్లాట్‌లు కొంటున్నారు. ఇది చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలే ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. కొద్ది రోజుల క్రితం అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ ముంబైలో కాస్ట్‌లీ ప్లాట్ కొనుగోలు చేసింద‌ని వార్త‌లు రాగా, రీసెంట్ పూజా హెగ్డే కూడా కొత్త ఫ్లాట్ కొనిందని అన్నారు.

ఇక ఇప్పుడు క‌న్న‌డ సోయగం ర‌ష్మిక మంధాన ముంబైలో కాస్ట్‌లీ ఫ్లాట్ కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇన్నాళ్ళు తెలుగు, త‌మిళ భాష‌ల‌లో సంద‌డి చేసిన కూర్గ్ భామ మిషన్ మజ్ను చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేస్తుంది. సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇండియా ఇంటిలిజెన్స్ ఆధారంగా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమాపై చాలా సీరియ‌స్‌గా ప‌ని చేస్తున్న ర‌ష్మిక‌ సొంత‌గా డ‌బ్బింగ్ చెప్పుకునేందుకు హిందీ క్లాసులకు కూడా అటెండ్ అవుతుంద‌ట‌.

అంతేకాదు ఈ అమ్మ‌డు ముంబైలో పాష్ ఫ్లాట్ కొన్న‌ద‌నే వార్త దావానంలా వ్యాపించింది. ఇన్నాళ్ళు హోట‌ల్స్‌లో ఉన్న ర‌ష్మిక ఇప్పుడు సొంత ఇంటికి వెళ్ళేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ అమ్మ‌డు హైద‌రాబాద్‌లో కాస్ట్‌లీ ఫ్లాట్‌ని కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో ర‌ష్మిక ముంబైలో ఫ్లాట్ కొన్న‌ద‌ని అంటున్నారు. మిషన్ మ‌జ్ను త‌ర్వాత ర‌ష్మిక.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిస ఓ సినిమా చేయ‌నుంది. ప్ర‌స్తుతం పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉంది ర‌ష్మిక‌.