అనసూయ వెళ్లిపోవడంతో మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి ఏకచ్ఛత్రాధిపత్యం వహించనున్న రష్మి!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో రేటింగ్ రావడంలేదని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఎంతో కీలకంగా ఉన్నటువంటి నటీనటులు అదేవిధంగా జడ్జెస్ కూడా వెళ్ళిపోయారు. ఇలా ఈ కార్యక్రమానికి కీలకంగా ఉన్నవారు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం అనుకున్నంత స్థాయిలో రేటింగ్ సంపాదించుకోలేకపోతోంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం నుంచి ప్రముఖ యాంకర్ అనసూయ కూడా తప్పుకున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం మొదట్లో అనసూయ మాత్రమే ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించేది.

అనసూయ ప్రెగ్నెంట్ కావడంతో ఈ కార్యక్రమం నుంచి కొన్ని రోజుల పాటు అనసూయ తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి యాంకర్ గా రష్మీని తీసుకొచ్చారు. అయితే యాంకర్ అనసూయ రావడంతో రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. ఇలా వారంలో రెండు రోజులు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే అనసూయకు సినిమా అవకాశాలు రావడంతో ఈమె కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరించనున్నారు.ఇకపై జబర్దస్త్ కార్యక్రమానికి ఇద్దరు యాంకర్లు కాకుండా రష్మీ మాత్రమే ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఏకచ్ఛత్రాధిపత్యం వహించనున్నారు.ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ప్రస్తుతం సుధీర్ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.