ప‌వ‌న్ సినిమా ఛాన్స్ కొట్టేసిన ర‌ష్మీ.. ఇక ఈ అమ్మ‌డి జోరుకు బ్రేకులు ఉండ‌వా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ సినిమాల‌కి జ‌నాల‌లో ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు రెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ సినిమాల్లోకి రావ‌డం, వ‌రుస పెట్టి సినిమాలు ప్ర‌క‌టించ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే అభిమానుల ఆనందానికి కరోనా కొంత బ్రేక్ వేసింద‌నే చెప్పాలి. క‌రోనా వ‌చ్చి ఉండ‌క‌పోతే ప‌వ‌న్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ ఎప్పుడో విడుద‌లై ఉండేది. కాని లాక్‌డౌన్ వ‌ల‌న చిత్ర షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌లయ్యేందుకు సిద్ద‌మైంది.

ప‌వ‌న్ వ‌రుస సినిమాల‌ను చేస్తుండ‌గా, ఈ సినిమాల‌లో న‌టించే హీరోయిన్స్ ఎవ‌ర‌నే దానిపై అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. క్రిష్ తెర‌కెక్కించ‌నున్న సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నార‌ని ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న రాగా, దీనిపై నిధి సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు బుల్లితెర న‌టి ర‌ష్మీ గౌత‌మ్‌కు కూడా పవ‌న్ సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తుంది. వ‌కీల్ సాబ్ చిత్రంలో శృతి హాస‌న్‌..ప‌వ‌న్ భార్య‌గా న‌టించ‌నుండ‌గా, ఆమెతో రెండు సాంగ్స్ ఉంటాయ‌ట‌. ఇక మ‌రో సాంగ్ ర‌ష్మీతో ప్లాన్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

ప‌వ‌న్ తో ఐటెం సాంగ్ అనే స‌రికి ఎగిరి గంతేసిన ర‌ష్మీ ఐటెం సాంగ్‌లో ప‌వ‌న్‌తో డ్యాన్స్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంది. ఈ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నట్టు సమాచారం.బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం పింక్‌కు రీమేక్‌గా వ‌కీల్ సాబ్ చిత్రం తెర‌కెక్క‌గా ఈ సినిమాను తెలుగు నేటివిటీతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా రూపొందించార‌ట‌. ఈ సినిమాలో శృతి హాసన్‌తో పాటు అంజలి, నివేదా థామస్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ రూ. 25 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం . శాటిలైట్ రైట్స్ .. రూ. 15 కోట్లకు జీ తెలుగు కొనుగోలు చేసినట్టు టాక్.