రానాతో ప‌వ‌న్ ఫైట్‌.. ఇక నేటి నుండి సెట్‌లో ర‌చ్చ ర‌చ్చే..!

ఓ వైపు రాజ‌కీయాలు మ‌రోవైపు సినిమాల‌తో బిజీబిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసి ప్ర‌స్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తుండ‌గా, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌న‌వ‌రి 25 నుండి చిత్ర షూటింగ్ మొద‌లైంది. ప‌వ‌న్ రీసెంట్‌గా సెట్స్ లోకి అడుగుపెట్టగా, ఆయ‌న‌కు సంబంధించిన ఓ స్పెష‌ల్ వీడియోను ఇటీవల విడుద‌ల చేశారు.

మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ప‌ది రోజుల పాటు అల్యూనియం ఫ్యాక్ట‌రీలో వేసిన లాడ్జ్ సెట్‌లో షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ లో యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే నేటి నుండి రానా కూడా ప‌వ‌న్ టీంతో క‌ల‌వ‌నున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తికర‌మైన ఫైట్ స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. సాయి ప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్య‌రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, వారు కూడా త్వ‌ర‌లోనే టీంతో జాయిన్ కానున్నారు.

ఈ ఏడాది ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ప‌వ‌న్ నెల‌న్న‌ర రోజుల డేట్స్ కేటాయించాడని టాక్‌. ప‌వ‌న్ క‌ల్యాన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇందులో ఓ ష్లాఫ్ బ్యాక్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశార‌ట‌. ఈ సినిమాలో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తే.. రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి పాత్ర ఉంటుంది. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించ‌నున్నారు. బిల్లా రంగా అనే టైటిల్‌ను చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది.