రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ రిలీజ్ !

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాదు లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదలర చేశారు. రజినీకాంత్ ఆరోగ్యం నిన్నటి కన్నా కొంచెం మెరుగ్గా ఉందని వారు చెప్పారు. నిన్నటితో పోలిస్తే ఆయన బీపీ నియంత్రణలో ఉందని చెప్పారు.

వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలు ఈ రోజు సాయంత్రానికి వస్తాయని వైద్యులు చెప్పారు. రజినీకాంత్ ను డిశ్చార్జీ చేసే విషయంపై ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు కూడా రజినీకాంత్ కు మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.

బీపీ హెచ్చతగ్గులంతో రజినీకాంత్ శుక్రవారం ఉదయం 9 గంటలకు అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చిరంజీవి, మోహన్ బాబు వంటి పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. గత 10 రోజులుగా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజనీ హైదరాబాద్ లో ఉంటున్నారు. రజినీకాంత్ వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.