Rajamouli : “RRR” స్క్రీనింగ్ కి సెన్సేషనల్ ప్లాన్ చేసిన రాజమౌళి.!

Rajamouli : ఇక ముందు రాబోయే భారీ సినిమాల్లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త లెక్కలను సెట్ చెయ్యగలిగే పాన్ ఇండియా సినిమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి ఎస్ ఎస్ తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి.

ఇద్దరు మాస్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి వారిని పెట్టుకొని ఎలాంటి సినిమా చెయ్యాలో అలాంటి సినిమానే చేసి జక్కన్న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త లెక్కలు సెట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు.
అయితే ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ని ఒక్క మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వేరే లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా లేటెస్ట్ గా మరో అదిరిపోయే సెన్సేషనల్ ప్లాన్ ని తాను వేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద థియేట్రికల్ స్క్రీన్ అయినటువంటి ఒడియన్ బిఎఫ్ఐ ఐమాక్స్ లో రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేశారట. ఈ థియేటర్ యునైటెడ్ కింగ్ డం దేశంలో ఉంది. అలాగే ప్రపంచంలో అతి పెద్ద స్క్రీన్ కూడా ఇదేనట.
దీనితో ఈ భారీ స్క్రీన్ పై “RRR” రిలీజ్ అవుతుందన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాని 3డి లో కూడా రిలీజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.
మరి అలాంటి స్క్రీన్స్ పై ఈ సినిమాని 3డి లో చూస్తేనే కిక్కొస్తుంది, మొత్తానికి అయితే తన సినిమాని ప్రమోట్ చెయ్యడంలో రాజమౌళిని కొట్టేవాడు ఇంకొకరు లేరు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు.