ఇండస్ట్రీలో షాకింగ్ గా మారుతున్న “లైగర్” నష్టాల వివాదం.!

ఈ ఏడాది ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా మార్కెట్ లో కూడా భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం “లైగర్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం అయితే భారీ నష్టాలు మిగిల్చిన సినిమాగా కూడా నిలిచింది. దీనితో లైగర్ వివాదం ఇప్పుడు మరింత స్థాయిలోకి వెళ్ళింది. రీసెంట్ గా పూరి జగన్నాథ్ వాయిస్ రికార్డింగ్ ఒకటి లీక్ కాగా అది పెద్దగా వైరల్ అవ్వడం కూడా జరగగా ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ కొందరిపై పోలీస్ కంప్లైంట్ చెయ్యడం షాకింగ్ గా మారింది.

దీనితో ఈ అంశమే ఓ ట్విస్ట్ అనుకుంటే ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ విషయంలో టాలీవుడ్ లో కొందరు ఫైనాన్సర్ లు పూరి జగన్నాథ్ సినిమాలకు ఇక నుంచి ఫైనాన్స్ చెయ్యకూడదు అనే ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

దీనితో లైగర్ వివాదం దర్శకుడు పూరి కి మాత్రం పెద్ద తలనొప్పిలా మారింది అని చెప్పాలి. మరి ముందు రోజుల్లో అయితే ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.