హీరోయిన్‌గా ఆమె.! వద్దు బాబోయ్ అంటోన్న నిర్మాతలు.!

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఓ యంగ్ హీరో అనన్యా పాండేని హీరోయిన్‌గా కావాలంటున్నాడట.

అనన్యా పాండే కూడా చేయడానికి రెడీగా వుందట. కానీ, నిర్మాత మాత్రం వద్దు బాబోయ్ అంటున్నాడట. అందుకు కారణం ‘లైగర్’ సినిమానే నో డౌట్.

‘లైగర్’తో అనన్యా పాండే బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి పరిచయమైంది. సినిమా ప్లాప్ అయ్యింది కానీ, సినిమాలో అనన్య ఎనర్జీ, పర్‌ఫామెన్స్ లెవల్ కొందరికి తెగ నచ్చేసిందంటే అతిశయోక్తి కాదేమో.

బ్యాడ్ లక్.! సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో, ఆ మచ్చ ఆమెపై అలా పడిపోయింది. దాంతో, ఆ తర్వాత ఇంతవరకూ అనన్యకు మరో ఛాన్స్ రాలేదు.

కానీ, ఈ యంగ్ హీరో మాత్రం అనన్యనే హీరోయిన్‌గా కావాలని మొరాయించుకుని కూర్చున్నాడట. కానీ, ఆ నిర్మాతకి సెంటిమెంట్లు ఎక్కువ కావడంతో, ససేమిరా అంటున్నాడట.

ఆఖరికి చేసేది లేక మరో హీరోయిన్‌ని వెతుకుతున్నారట. అనన్య కాకుంటే, ‘డీజె టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి పేరు వినిపిస్తోంది. అయితే, ఒకింత స్టార్ డమ్ వున్న హీరోయిన్ అయితే బాగుంటుందనుకుంటున్నారట. అసలింతకీ ఎవరా హీరో.? తెలియాల్సి వుంది.