జాతి రత్నాలు షోలో నూకరాజు పరువు తీసిన పంచ్ ప్రసాద్..!

ఈ టీవిలో బుల్లితెర మీద ప్రసారమౌతున్న కామెడీ షో ల ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అటువంటి వారిలో నూకరాజు కూడ ఒకరు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నూకరాజు మంచి గుర్తింపు పొందాడు. తర్వాత జబర్దస్త్ హలో తన పంచులతో సందడి చేశాడు. ప్రస్తుతం నూకరాజు జాతిరత్నాలు అనే కామెడీ షో లో సందడి చేస్తున్నాడు. ఈ షోలో నూకరాజు తన కామెడీ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు.

అప్పుడప్పుడు నూకరాజు ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో లో కూడా సందడి చేస్తుంటాడు. నూకరాజుకి షుగర్ రోగం ఉన్న సంగతీ అందరికి తెలిసిన విషయమే. అప్పుడప్పుడు నూకరాజు తనకున్న రోగం గురించి తనమీద తానే సెటైర్లు వేసుకుంటూ ఉంటాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్ లు కూడా అప్పుడప్పుడు నూకరాజు రోగం మీద సెటైర్లు వేస్తూ ఉంటారు . తాజాగా జాతి రత్నాలు షో కి సంబందించిన ప్రోమో విడుదలయ్యింది. ఈ ఎపిసోడ్ లో నూకరాజు వ్యాధి మీద సెటైర్లు వేశారు. ఈ షోలో ఓ అమ్మాయి వచ్చి టూరిస్ట్, ట్రావెల్ గురించి చెప్పింది.

ఇంట్లో టూర్‌కు వెళ్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించటానికి పడే కష్టాల గురించి చెబుతు కామెడీ చేసింది. ఇందులో భాగంగానే ఆ యువతి శ్రీముఖిని టూర్‌కు వెళ్లావా? అని అడుగుతుంది. తర్వాత నూకరాజుకి కూడ అదే ప్రశ్న వేసింది. ఆ సమయంలో పంచ్ ప్రసాద్ కల్పించుకొని “అతను టూర్‌కు ప్రత్యేకంగా వెళ్లడం ఏంటి? ఎప్పుడు టూర్‌లోనే ఉంటాడు.. మధ్య మధ్యలోనే షూటింగ్‌కు వస్తాడు అని తన వ్యాధి గురించి పంచ్ ప్రసాద్ కౌంటర్ వేశాడు.