Crime: ప్రేమించి పెళ్లి చేసుకోలేదనే కక్షతో అంతటి ఘాతుకానికి తెగించిన యువకుడు..?

Crime: తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం లో ఒక ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. మండల పరిధిలోని దశ్రు తండాలో రాజేందర్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమించి తన పెళ్లి చేసుకోలేదన్న కక్షతో ఆ యువకుడు ఆ యువతికి పురుగుల మందు తాగించి అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇది గమనించిన స్థానికులు హుటా హుటిన వారిద్దరి నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.

ఇక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆ యువకుడు రాజేందర్ మృతి చెందాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక మృతుడు రాజేందర్ ములుగు మండలం చింతకుంట వాసిగా పోలీసులు గుర్తించారు.