మేము నీ వెనుక ఉన్నామంటూ సాయి పల్లవికి ధైర్యం ఇచ్చిన ప్రకాశ్ రాజ్..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సాయిపల్లవి ఇటీవలే విరాటపర్వం సినిమాతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఆమెకు ఒక ప్రశ్న ఎదురవడంతో అందులో కశ్మీర్ పండిట్స్, గోహత్యలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఈ విషయంలో తప్పుపడుతూ నెగటివ్ కామెంట్లు చేశారు.

దీంతో సాయిపల్లవి ఈ విషయం గురించి స్పందించింది. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని, అందరి ప్రాణాలు ముఖ్యమే అంటూ.. మతం పేరుతో చేసే హింస మహాపాపమని తెలిపింది. దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలు
అర్థం చేసుకోకుండా నెగటివ్ గా స్పందించటంతో.. ప్రకాష్ రాజ్ ఈ విషయం గురించి ఆమెకు సపోర్ట్ చేశాడు. ‘మానవత్వమే అన్నిటికంటే ముందు.. కాబట్టి సాయిపల్లవి.. మేము నీతోనే ఉన్నాం అని ధైర్యం ఇచ్చాడు.