Prabhas – Amitab: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ నుంచి ప్రశంసలు అందుకున్న ప్రభాస్… ట్వీట్ వైరల్!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చింది, అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా రాధేశ్యామ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఈ సినిమాకు ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి అశ్వినీదత్‌ ప్యాన్‌ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే అమితాబ్ ఈ షూట్‌లో పాల్గొన్నారు. ప్రభాస్‌,బిగ్‌బీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

అయితే ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.”బాహుబలి”ప్రభాస్ తో తొలి సినిమా.. మొదటి రోజు.. మొదటి షాట్‌ షూట్‌ జరిగింది. అతని.. టాలెంట్‌ చూసి నేర్చుకోవడానికి చాలా ఉందని గ్రహించా” అని ట్వీట్‌ చేశారు. అమితాబచ్చన్ ఇలా రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రశంసించడం విశేషంగా ఉంది. ఇక ఒకే స్క్రీన్ మీద వీళ్లిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి అని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.