Prabhas : ఈ ఏడాది ప్రభాస్ ప్లానింగ్ లో బిగ్ చేంజ్..కేవలం ఈ సినిమాలు మాత్రమే.!

Prabhas : టాలీవుడ్ నుంచి మొత్తం ప్యాన్ ఇండియా సినిమా దగ్గర తిరుగు లేని హీరోగా ఎదిగిన ఏకైక టాలీవుడ్ మొదటి హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి తర్వాత భారీ సినిమాలు ఒక్కొక్కటిగా చేస్తూ వరల్డ్ సినిమా దగ్గర సంచలనం రేపుతున్న ఈ హీరో ఒక ప్లానింగ్ ప్రకారం సినిమాలు రిలీజ్ చెయ్యడానికి అలాగే షూటింగ్ లను ప్లాన్ చేసుకుంటుండగా..
ఇప్పుడు ఈ ప్లానింగ్ లో బిగ్ చేంజ్ చోటు చేసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ ఏడాది ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్ అంటే మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. మొదట “రాధే శ్యామ్” తర్వాత “ఆదిపురుష్” అలాగే ఆ తర్వాత భారీ ఏక్షన్ డ్రామా “సలార్” విడుదల కావాలి. కానీ ఇప్పుడు ఈ రెండింటి లో కేవలం రెండు సినిమాలే విడుదల అవుతాయట.
అది కూడా రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ మాత్రమే అని తెలుస్తోంది. మరి సలార్ ని అయితే వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేసేసారట. మరి దీనిపై ఏమన్నా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఇక ఈ భారీ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా హోంబలే పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.