Pooja Hegde :వైరల్ : “RRR” హీరోలపై డస్కీ బ్యూటీ సెన్సేషనల్ పోస్ట్.!

Pooja Hegde :ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎనలని అంచనాలతో ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన చిత్రం “రాధే శ్యామ్” మరియు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు రామ్ చరణ్ అలాగే జూ ఎన్టీఆర్ లతో చేసిన భారీ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా మరియు సినిమా హీరోలపై రాధే శ్యామ్ డస్కీ బ్యూటీ పూజా హెగ్డే పెట్టిన ఓ సెన్సేషనల్ ఎగ్జైట్మెంట్ పోస్ట్ వైరల్ గా మారింది. నిన్న విడుదల చేసిన ఇద్దరి మాస్ పోస్టర్ లు చూసింది ఏమో కానీ తన ఎగ్జైట్మెంట్ ని మాత్రం ఆపుకోలేక పోయింది. ‘ఇద్దరు హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు చాలా ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారు.

ఇద్దరినీ సిల్వర్ స్క్రీన్ ఫైర్ పై చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను, ‘RRR’ లో రాజమౌళి స్టోర్ చేసిన ఎమోషనల్ డ్రైవ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాని’ తన ఎగ్జైట్మెంట్ అంతా ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. దీనితో ఈ పోస్ట్ కాస్తా వారి అభిమానుల్లో వైరల్ అవుతుంది.