క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు, నిమ్మకాయను తిన్న పోలీస్!

దేశం కొత్త కొత్త టెక్నాలజీ తో ముందుకు వెళ్తున్న కూడా మూఢనమ్మకాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఇప్పటికీ క్షుద్ర పూజలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఆ పూజలలో వాడిన పదార్థాలను చూస్తే భయపడిపోతుంటాం. కానీ ఓ పోలీస్ మాత్రం వాటిని తిని అందరికీ షాకిచ్చాడు. ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

వరంగల్ బట్టల బజార్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ఆది, బుధవారాల్లో కొందరు క్షుద్ర పూజలు చేయటంతో అక్కడికి వెళ్లే ప్రజలు భయపడుతున్నారు. దీంతో ఈ విషయం వరంగల్ పోలీసులకు తెలియడంతో.. అక్కడున్న కోడి గుడ్లు, నిమ్మకాయలను, కొబ్బరి కాయలను పరిశీలించడంతో.. అందులో నారాయణ అనే హోంగార్డ్ ఆ పదార్థాలను తినేసాడు. ఇందులో ఎటువంటి మూఢనమ్మకాలు లేవని కేవలం అపోహమంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.