చంద్రబాబు మాటలకు జనం నవ్వుతున్నారు: కారుమూరి నాగేశ్వరరావు

తాజాగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పై విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబు తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదన్న పిచ్చి మాటలు విని జనం నవ్వుతున్నారు అని వెటకారం చేశారు. అంతేకాకుండా తుఫానులను ఆపుతానని.. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గిస్తానని తన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని అన్నాడు.

ఇక అయ్యన్నపాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించి.. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దడం ఏంటి అని అన్నారు. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అన్నారు. ఇక ఈ మంత్రి మాటలకు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.