Pawan Kalyan: సైన్యం కోసం ఆలయాలలో ప్రత్యేక పూజలు… పవన్ కీలక నిర్ణయం!

Pawan Kalyan: పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడుతుంది ఇలాంటి తరుణంలోని పాకిస్తాన్ ఎత్తుగడలను భారత్ చిత్తూ చేస్తూ తగిన గుణపాఠం చెబుతోంది. ఇలా భారతదేశాన్ని రక్షించడం కోసం సరిహద్దు ప్రాంతాలలో జవాన్లు ఎంతో కష్టపడుతూ ఉన్నారు.

ఇలా మన దేశాన్ని మనల్ని రక్షిస్తున్న వారు క్షేమంగా ఉండాలని వారి కోసం ప్రత్యేకంగా పూజలు చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సైన్యానికి నైతిక మద్దతు అందించేలా షష్ట షణ్ముక క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించారు. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ మీద భారతదేశం చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఇలా శత్రువులతో పోరాటం చేస్తున్న సైనికులకు ప్రధాని మోదీకి దైవ బలం, ఆశీస్సులు ఉండేలా దేవుణ్ని ప్రార్థించాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఇందులో భాగంగా జనసేన పార్టీ తరుఫున మంగళవారం ఉదయం షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయాలని తెలిపారు.

ప్రతి ఒక్క ఆలయానికి ఒక ఎమ్మెల్యేతో పాటు పలువురు జనసైనికులను పంపించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయంతో పాటుగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయనున్నారు. ఇక ఆదివారం అసరవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో కూడా సైనికులకు ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించబోతున్నారు. ఇలా సైనికులకు మరింత శక్తి సామర్థ్యాన్ని అందిస్తూ వారి క్షేమం కోసం పవన్ కళ్యాణ్ పలు ఆలయాలలో పూజలు చేయాలని తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.