పవన్ సినిమాకు అంతా సెట్ అయినట్టే

Pawan Kalyan to resume shoot from 12th July
Pawan Kalyan to resume shoot from 12th July
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రాల్లో మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడ ఉంది.  పవన్, రానాలు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ఈ చిత్రం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ మూలంగా సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఒరిజినల్ వెర్షన్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రలో పవన్ కనిపిస్తారు. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తైంది కూడ. లాక్ డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా చిత్రీకరణ ఆగిపోయింది. 
 
ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు రావడంతో మళ్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుండి హైదరాబాద్లో చిత్రీకరణ మొదలుకానుంది.  ఈ షూటింగ్లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ పాల్గొంటారట.  అలాగే పవన్ జోడీగా ఎంపికైన నిత్యా మీనన్, రానా సరసన నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ సైతం షూట్లో పాల్గొంటారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక జానపద గీతాన్ని ఆలపించనున్నారట.  పవన్ మల్టీస్టారర్ చిత్రం చేయడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖరుకు సినిమా రిలీజ్ ఉండొచ్చు.  లేని పక్షంలో 2022 సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేస్తారు.