వైసీపీ పై సెటైర్ వేసిన పవన్ కళ్యాణ్..?

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సెటైర్లు వేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అవినీతి నిర్మూలన కోసం ‘ఏసీబీ 14400’ అనే మొబైల్ యాప్ ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్ కు సమాచారం ఇస్తే అవినీతి అక్రమార్కుల భరతం పడతామన పేర్కొంది.

పైగా ఈ యాప్ ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా బాగా ప్రచారాలు కూడా చేశారు. అవినీతిని ఏరి పారేయాల్సిన అవసరం ఉందని, అవినీతి నిరోధానికి ఇది ఒక విప్లవాత్మక మార్పు అని జగన్ అనడంతో.. పవన్ కళ్యాణ్ దీని పై సెటైర్ వేసాడు. మరి వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేయాలి అంటే ప్రజలు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ వెటకారం చేశాడు.