Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవలకు అలాగే ఆయన బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.
ఇక ఈ అవార్డును అందుకోవడం కోసం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారం అందుకునే సమయంలో ఈయన తెలుగుదనం ఒట్టిపడేలా పంచ కట్టులో కనిపించారు. అచ్చం ఈ దుస్తులలో అన్న ఎన్టీఆర్ గారిని తలపించారనే చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాల పాటుగా కొనసాగుతున్న బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అలాగే అభిమానులు కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదిక పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య పద్మ భూషణ్ పురస్కారం గురించి నటుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు.
ఈ సందర్భంగా పవన్ బాలయ్య పద్మ భూషణ్ పై స్పందిస్తూ… హిందూపురం శాసనసభ్యులు, కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మ భూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారికి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రాత్మక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రజాసేవలో, కళా సేవలో శ్రీ బాలకృష్ణ గారు మరిన్ని మైళ్ళు రాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.