Pakistan: భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తుంది. భారత్ చేస్తున్న దాడుల కారణంగా పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే భారత్ తో పాక్ కాళ్ల బేరానికి వస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డిప్యూటీ పీఎం, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ పై భారత్ దాడలు ఆపితేనే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని పాక్ మంత్రి ఇషాక్ దార్ ప్రకటన చేశారు.
భారత్ ఆగిపోతే, మేం కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ తెలిపారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని తెలిపారు. ఇలాంటి సమయంలో భారతదేశం ఆగిపోతే మేము కూడా శాంతిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని, ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు.భారత్తో చర్చల కోసం కొత్త కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాలు సీఎన్ఎన్ న్యూస్కు తెలిపాయి.
ఇక పాకిస్తాన్ ఒక ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయకముందే అమెరికా పాకిస్తాన్ కు పలు కీలక సూచనలు చేసిందని తెలుస్తోంది.రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్తాన్కు అమెరికా సూచనలు చేసింది. సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది.
ఇలా రెండు దేశాల మధ్య తాము మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ యుద్ధాన్ని ఆపుతూ శాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి తెలిపారు. ఇప్పటికే పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపి వేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.